జగన్ ఈజ్ బ్యాక్

| Edited By:

Apr 27, 2019 | 1:06 PM

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేడు వేసవి విడిది ముగించుకుని హైదరాబాద్ రానున్నారు. సుదీర్ఘ పాదయాత్ర, ఆపై ఎన్నికల ప్రచారంతో తీవ్రంగా అలసిపోయిన జగన్..కాస్త రిలీఫ్ కోసం స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా నేడు జగన్ విశాఖకు వెళ్లనున్నారు. నగరంలో జరుగనున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహానికి హాజరుకానున్నారు. ఈ రోజు రుషికొండ సమీపంలోని సాయిప్రియా […]

జగన్ ఈజ్ బ్యాక్
Follow us on

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేడు వేసవి విడిది ముగించుకుని హైదరాబాద్ రానున్నారు. సుదీర్ఘ పాదయాత్ర, ఆపై ఎన్నికల ప్రచారంతో తీవ్రంగా అలసిపోయిన జగన్..కాస్త రిలీఫ్ కోసం స్విట్జర్లాండ్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా నేడు జగన్ విశాఖకు వెళ్లనున్నారు. నగరంలో జరుగనున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహానికి హాజరుకానున్నారు. ఈ రోజు రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి  విమానంలో బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్‌కు వెళతారు.వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.