Vijayawada: బెజవాడలో దారుణం.. ఇన్‌స్టాలో పరిచయం.. కూతురు వెంటపడొద్దన్నందుకు కిరాతకంగా..

|

Jun 28, 2024 | 9:57 AM

కూతురు వెంట పడొద్దని.. తనను మందలించాడని కోపం పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని రగిలిపోయాడు. ప్రేమికురాలి తండ్రిపై ఆగ్రహం పెంచుకున్న ఆ దుర్మార్గుడు.. ఆయన కోసం కాపు కాచాడు. రాత్రివేళ ఎదురుపడగానే వాగ్వాదానికి దిగాడు. అంతే మాట మాట పెరిగింది. తన చేతిలో ఉన్న కత్తి తీశాడు. అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపొద్దని కూతురు వేడుకుంటున్న ఆగకుండా అత్యంత క్రూరంగా నరికి చంపాడు.. ఈ దారుణ ఘటన విజయవాడలోని బృందావన్‌ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది..

Vijayawada: బెజవాడలో దారుణం.. ఇన్‌స్టాలో పరిచయం.. కూతురు వెంటపడొద్దన్నందుకు కిరాతకంగా..
Crime News
Follow us on

కూతురు వెంట పడొద్దని.. తనను మందలించాడని కోపం పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని రగిలిపోయాడు. ప్రేమికురాలి తండ్రిపై ఆగ్రహం పెంచుకున్న ఆ దుర్మార్గుడు.. ఆయన కోసం కాపు కాచాడు. రాత్రివేళ ఎదురుపడగానే వాగ్వాదానికి దిగాడు. అంతే మాట మాట పెరిగింది. తన చేతిలో ఉన్న కత్తి తీశాడు. అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన తండ్రిని చంపొద్దని కూతురు వేడుకుంటున్న ఆగకుండా అత్యంత క్రూరంగా నరికి చంపాడు.. ఈ దారుణ ఘటన విజయవాడలోని బృందావన్‌ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది..

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..

భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన కె.శ్రీరామచంద్రప్రసాద్‌ (56) బృందావన్‌ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నిత్యం భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ విజ్ఞాన్‌ విహార్‌ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్‌స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను హెచ్చరించాడు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలన్నాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. దీంతో కొద్దిరోజులుగా దార్శిని అతడిని పక్కనపెట్టింది. పెళ్లి చేసుకోవాలని మణికంఠ చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిపై శ్రీరామచంద్రప్రసాద్‌ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంట్లో పంచాయితీ పెట్టాడు. ఆ తర్వాత మణికంఠ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకున్నాడు.

గురువారం శ్రీరామచంద్రప్రసాద్‌ కుమార్తెను తీసుకుని బృందావన్‌ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి ఇద్దరూ ఇంటికి బయల్దేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని బృందావన్‌ కాలనీకి వచ్చాడు. షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడ్డాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్‌పై వస్తుండగా, ఎదురుగా వెళ్లి బైకుతో ఢీ కొట్టాడు. కిందపడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్‌పై కత్తితో పొడిచాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టగానే మళ్లీ అతనిపై దాడి చేశాడు. దార్శిని ఎంత ఆపినా విచక్షణారహితంగా నరికాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. చుట్టుపక్కల వారు రాగానే మణి పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్‌ను వెంటనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై సమచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసు పత్రి మార్చురీకి తరలించారు. కేసును కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..