పోస్టల్ బ్యాలెట్స్‌లో అవకతవకలపై సీఈఓకు వైసీపీ ఫిర్యాదు

| Edited By:

May 09, 2019 | 2:12 PM

పోస్టల్ బ్యాలెట్స్ లో అవకతవకలపై ఏపీ రాష్ట్ర సీఈఓ ద్వివేదికి వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఆధారాలతో సహా ద్వివేదికి తిప్పేస్వామి సమర్పించారు. ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారి సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ద్వివేదిని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది ఇందుకు సంబంధించి నివేదిక పంపాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ను […]

పోస్టల్ బ్యాలెట్స్‌లో అవకతవకలపై సీఈఓకు వైసీపీ ఫిర్యాదు
Follow us on

పోస్టల్ బ్యాలెట్స్ లో అవకతవకలపై ఏపీ రాష్ట్ర సీఈఓ ద్వివేదికి వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఆధారాలతో సహా ద్వివేదికి తిప్పేస్వామి సమర్పించారు. ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారి సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ద్వివేదిని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది ఇందుకు సంబంధించి నివేదిక పంపాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.