బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

| Edited By:

Jun 29, 2020 | 5:46 PM

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే...

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..
Follow us on

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వైసీపీ నేత భాస్కర రావు హత్య కేసులో కీలక ఆధారాలు గుర్తించారు పోలీసులు. వైసీపీ నేత హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భాస్కరరావును హత్య చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కత్తితో హత్య చేసిన వ్యక్తిని చింత పులిగా గుర్తించాం. హత్య చేసి అనంతరం బైక్‌పై ఎక్కించికెళ్లిన మరో నిందితుడు చింత చిన్ని. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Read More: 

కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..