తిరుపతి కొత్తూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. టీడీపీ కార్యకర్తలపై దాడికి తెగబడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. కాగా.. ముగ్గురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.