గేమ్స్ ఆడుతున్నావ్..!అంటూ..చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ

| Edited By:

Feb 08, 2020 | 7:16 AM

ఏపీ రాజధాని అంశంపై ఓ వైపు రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ పత్రికలో వచ్చిన కథనం.. సంచలనంగా మారింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని.. ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధానికి తెరలేచింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ […]

గేమ్స్ ఆడుతున్నావ్..!అంటూ..చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ
Follow us on

ఏపీ రాజధాని అంశంపై ఓ వైపు రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ పత్రికలో వచ్చిన కథనం.. సంచలనంగా మారింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని.. ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధానికి తెరలేచింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

రాయిటర్స్ పత్రికలో కియా మోటార్స్ గురించి కథనం రాయించింది చంద్రబాబే అన్నట్లు ఆయన ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ‘ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు. బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!’ అంటూ విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.