చంద్రబాబు ఎంతటి “సమర్థులో”.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Feb 09, 2020 | 5:30 PM

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కియాపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ నన్ను హత్య చేశారని.. నేను ఆత్మగా తిరుగుతున్నానని.. ప్రజలను నమ్మించగల సమర్ధుడు చంద్రబాబు అంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. కియా సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని.. ఇంకా ఏం కావాలో చెప్పండని సంస్థను జగన్ సర్కార్ అడుగుతోందన్నారు. […]

చంద్రబాబు ఎంతటి సమర్థులో.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
Follow us on

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కియాపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ నన్ను హత్య చేశారని.. నేను ఆత్మగా తిరుగుతున్నానని.. ప్రజలను నమ్మించగల సమర్ధుడు చంద్రబాబు అంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. కియా సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని.. ఇంకా ఏం కావాలో చెప్పండని సంస్థను జగన్ సర్కార్ అడుగుతోందన్నారు. మా ప్రాంత వాసులకు ఉద్యోగాలు కల్పించండని కియాను కోరామని.. ఇంకా స్థలం విషయంలో కానీ.. ఇతర అవసరాల విషయంలో అన్ని సహకారాలు చేస్తామని తెల్పినట్లు స్పష్టం చేశారు.