ప్రకాశం జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఒకరి మృతి

| Edited By:

Jun 25, 2019 | 11:33 AM

ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ తెల్లవారుజామున టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్త పద్మకు గాయాలయ్యాయి. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దాడి తరువాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్తత […]

ప్రకాశం జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఒకరి మృతి
Follow us on

ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ తెల్లవారుజామున టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్త పద్మకు గాయాలయ్యాయి. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దాడి తరువాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయంలో మొదలైన ఘర్షణలు పలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలను కోల్పోయారు.