కోర్టు తీర్పుపై రాములమ్మ ఉద్వేగం

| Edited By:

Jan 08, 2020 | 4:22 AM

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. ఢిల్లీలోని పాటియాల కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైల్లో ఉరితీయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ 14 రోజుల్లో.. దోషులు వారి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. అటు తెలంగాణ కాంగ్రెస్ […]

కోర్టు తీర్పుపై రాములమ్మ ఉద్వేగం
Follow us on

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. ఢిల్లీలోని పాటియాల కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైల్లో ఉరితీయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ 14 రోజుల్లో.. దోషులు వారి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కూడా దీనిపై స్పందించారు. అంతేకాదు.. తనదైన శైలిలో ఓ సందేశాన్ని తెలియజేశారు.

“నిర్భయ విషయంలో కోర్టు ద్వారా వచ్చిన తీర్పు అయినా.. దిశ విషయంలో ప్రజా ఆగ్రహజ్వాలల నుండి ప్రకృతి విధించిన శిక్ష అయినా.. స్త్రీ మూర్తి మనస్ఫూర్తిగా అభినందించ తగినవే… మన భారతదేశంలో న్యాయం, దైవం ఉన్నాయని నమ్మకం కలిగించేవే. ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం ప్రతి భారతీయ హృదయం నిజాయితీతో తల్లడిల్లుతూ… వ్యవస్థలను విశ్వసిస్తూ… పంచుకుంటున్న ఉద్వేగం ఈ అభిప్రాయం”. అని తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.