ముగ్గుల్లో ‘కారు’.. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ వినూత్న ప్రచారం

| Edited By:

Jan 13, 2020 | 2:04 PM

తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు మళ్లీ మొదలైంది. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో […]

ముగ్గుల్లో కారు.. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ వినూత్న ప్రచారం
Follow us on

తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు మళ్లీ మొదలైంది. ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో పైసా ఖర్చు లేకుండా టీఆర్ఎస్ వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి దిగింది. సంక్రాంతిని పురస్కరించుకొని మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెంలో ఇళ్ల ముందు కారు ముగ్గులను వేశారు టీఆర్ఎస్ అభిమానులు. అందులో కారు గుర్తుకే మన ఓటు.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని రాసుకొచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.