శిరోముండనం కేసు: నూతన్ నాయుడు భార్య కొత్త డ్రామా

| Edited By:

Aug 30, 2020 | 11:52 AM

ఏపీలోని విశాఖ పెందుర్తిలో కలకలం రేకెత్తించిన శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది

శిరోముండనం కేసు: నూతన్ నాయుడు భార్య కొత్త డ్రామా
Follow us on

Tonsuring case Updates: ఏపీలోని విశాఖ పెందుర్తిలో కలకలం రేకెత్తించిన శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలో నూతన్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా నిందితులను ప్రశ్నించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. కాగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ నుంచి తప్పించుకునేందుకు నూతన్ భార్య  మధుప్రియ నాటకం ఆడారు. తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ వెల్లడించింది

ఈ క్రమంలో ఆమెకు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఇందులో నూతన్ నాయుడు ప్రమేయంపైన ఆరా తీస్తున్నారు.‌ అయితే తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌‌ నాయుడు భార్య మధుప్రియ, కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడిని కొట్టి, శిరోముండనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Read More:

అతడిని వదల్లేకపోతున్న సుకుమార్.. ‘పుష్ప’లో కీలక పాత్ర‌!

ఏపీలో ఆలయంకు సీఎం కేసీఆర్ విరాళం