పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పింది. నరసాపురంలో ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు అదుపుతప్పి పంట కాలువలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న స్థానికులు విద్యార్థులను సురక్షితంగా కిందికి దించారు.