అక్కాచెల్లెళ్ల మధ్య ‘టీవీ’ చిచ్చు.. ఒకరి ఆత్మహత్య

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2020 | 11:20 AM

టీవీ విషయంలో మొదలైన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. పేట్‌బషీరాబాద్ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భాగ్యలక్ష్మి కాలనీలో నివసించే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె(19) జనగాంలో వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇటీవల ఆమె ఇంటికి రాగా.. ఆదివారం నాడు టీవీ చూసే విషయంలో చెల్లెలితో గొడవ జరిగింది. దీంతో అవమానానికి గురైన అక్క […]

అక్కాచెల్లెళ్ల మధ్య టీవీ చిచ్చు.. ఒకరి ఆత్మహత్య
Follow us on

టీవీ విషయంలో మొదలైన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. పేట్‌బషీరాబాద్ ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భాగ్యలక్ష్మి కాలనీలో నివసించే ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె(19) జనగాంలో వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇటీవల ఆమె ఇంటికి రాగా.. ఆదివారం నాడు టీవీ చూసే విషయంలో చెల్లెలితో గొడవ జరిగింది. దీంతో అవమానానికి గురైన అక్క ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.