కర్నూలు జిల్లా పాణ్యంలో 8వ తరగతి విద్యార్థిని మృతి కలకలం రేపింది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ వద్ద సుష్మ అనే విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి కిందపడిపోయి చనిపోయింది. అయితే ప్రమాదవ శాత్తూ విద్యార్థి కిందపడిపోయిందని స్కూల్ యాజమాన్యం అంటోంది. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి భరించలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.