మాజీ ఎమ్మెల్యేలందరికీ గన్మెన్లను తొలగిస్తూ.. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని 14 మంది మాజీ ఎమ్మెల్యేలకు గన్ మెన్లను తొలగించారు. మొత్తం 32 మంది గన్మెన్లను వెనక్కి పిలిచారు. ఎస్ఆర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏయే నాయకుడికి గన్మెన్లు అవసరమో. వారికి తిరిగి కేటాయించనున్నారు.