భద్రాద్రి కొత్తగూడెం : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.