ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ఛైర్మన్‌గా సాంబశివారెడ్డి నియామకం

| Edited By:

May 24, 2020 | 7:28 AM

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా డాక్టర్ బి సాంబశివారెడ్డిని నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనికి రూ.2 లక్షల రూపాయల వేతనంతో పాటు అధికారిక నివాసం..

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ఛైర్మన్‌గా సాంబశివారెడ్డి నియామకం
Follow us on

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా డాక్టర్ బి సాంబశివారెడ్డిని నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనికి రూ.2 లక్షల రూపాయల వేతనంతో పాటు అధికారిక నివాసం, వాహనం, ఇతర సదుపాయాలను కల్పించింది జగన్ సర్కార్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ బాధ్యతల్లో భాగంగా… విధాన పరమైన నిర్ణయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. వైద్య నిపుణుడిగా ఆ రంగంలో ట్రస్టు నిర్వహణకు ఎప్పటికప్పుడు సూచనలు, విధానాల రూపకల్పనలో భాగస్వామి కావాలని స్పష్టం చేసింది. అధికారిక సమావేశాల్లో పాల్గొని ట్రస్టు నిర్వహణకు, నెట్ వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన అంశాల్లోనూ ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సిందిగా ఏపీ సర్కర్ పేర్కొంది.