అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాడికి మండలం రాయలచెరువులో ఆర్ఎంపీ డాక్టర్ నరసింహారావుపై గుర్తు తెలియని దుండగులు వేటకొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో నరసింహారావు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. కాగా ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.