జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేసి వెళ్తూ.. వెళ్తూ.. జనసేనానిపై ఆరోపణలు చేస్తూ వెళ్లారు. పవన్కు నిలకడ లేదని.. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పి.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడం ఏంటని ప్రశ్నిస్తూ.. పవన్ తీరు నచ్చకనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. అయితే పవన్కు బాసటగా టీడీపీ నేత సొమిరెడ్డి నిలిచారు. లక్ష్మీనారాయణ రాజీనమాపై స్పందిస్తూ.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిచారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదంటూ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.
లక్ష్మీ నారాయణ (@VVL_Official) గారూ..ఎన్టీఆర్,ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. @PawanKalyan ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ… రాజకీయ నాయకులు నిజజీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం..
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 31, 2020