ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో పలు సమస్యలపై చర్చించి.. వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజ మహంకాళి దేవాలయం గురించి ప్రస్తావించారు. లాల్ దర్వాజ బోనాలు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని.. ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెయ్యాలని కేసీఆర్కు తెలిపారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు పార్కింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా. . ఆలయ విస్తరణ కూడా జరగాలని.. పార్కింగ్ సమస్య కూడా తలెత్తకుండా.. సమస్యను తీర్చాలని కోరారు. ఓవైసీ వినతిపత్రంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.