తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే ఇవ్వలేమంది హైకోర్టు. ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. సచివాలయ నిర్మాణాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అప్పటి వరకు భవనాల కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.