ఆక్రమణల తొలగింపు.. తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నరసింహరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల ఆక్రమణలను దేవాదాయ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. అయితే అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చేందుకు ఓ వైపు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ తాడేపల్లి గూడెంలో అక్రమణ కట్టడాల తొలగింపుపై సిద్ధమైంది. […]

ఆక్రమణల తొలగింపు.. తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 2:36 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నరసింహరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల ఆక్రమణలను దేవాదాయ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. అయితే అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చేందుకు ఓ వైపు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ తాడేపల్లి గూడెంలో అక్రమణ కట్టడాల తొలగింపుపై సిద్ధమైంది.