ఉమ్‌పన్ ఎఫెక్ట్: ఏపీలో వెండి నాణేల వర్షం..

|

May 23, 2020 | 6:09 PM

ఉమ్‌పన్ తుఫాన్ దాటికి తీరప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఏపీలో ఉమ్‌పన్ బలమైన ఈదురుగాలులతో బీభత్సం స్పష్టించింది. గాలివాన భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, ఓ జిల్లాలో మాత్రం వెండి నాణేల వర్షం కురిసింది.

ఉమ్‌పన్ ఎఫెక్ట్: ఏపీలో వెండి నాణేల వర్షం..
Follow us on

ఉమ్‌పన్ తుఫాన్ దాటికి తీరప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఏపీలో ఉమ్‌పన్ బలమైన ఈదురుగాలులతో బీభత్సం స్పష్టించింది. గాలివాన భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం వెండి నాణేల వర్షం కురిసింది. జిల్లాలోని సముద్ర తీరం వెంట ఒక్కసారిగా వెండి నాణేలు కురిశాయి. దీంతో స్థానికులు ఓ వైపు ఆనందం, మరో ఆశ్చర్యంలో మునిగితేలారు. వివరాల్లోకి వెళితే…
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయి. దీంతో ఉప్పాడ కొత్తపల్లిలోని కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. సుమారు ఎనిమిది ఇళ్ల వరకు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఓ కూలిపోయిన ఇంటి గోడల్లోంచి వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివిగా భావిస్తున్నారు. అయితే, వీటి వెనుక స్థానికులు అనేక రకలైన కథలు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబానికి చెందినవారు ధనవంతులని, వారు ఇంటి గోడలలో ఈ వెండి నాణేలు దాచిపెట్టారేమో అనే పుకార్లు వినిపిస్తున్నాయి. వందల సంఖ్యలో వెండి నాణేలు స్థానికులకు దొరికినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం స్థానికులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.. పురావస్తు శాఖవారికి తెలిస్తే..వారు వెండి నాణేలు సీజ్ చేస్తారనే భయంతో ఇళ్లల్లో దాచుకున్నట్లు సమాచారం.