Covid-19: ఏపీలో కోవిడ్-19 కలకలం.. ఓ యువతికి కరోనా లక్షణాలు..!

| Edited By: Venkata Rao

Feb 19, 2020 | 4:11 PM

Covid-19 in Andhra Pradesh: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19 భారత్‌లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొదట ఈ వ్యాధి లక్షణాలు కేరళలో ముగ్గురికి బయటపడగా.. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వైరస్ నిదానంగా భారత్‌లో ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న తమిళనాడులో ఓ వ్యక్తి ఈ వైరస్ లక్షణాాలతోనే మృతి చెందినట్లు వైద్యులు అనుమానాలు వ్యక్తపరుస్తుండగా.. తాజాగా ఏపీలో కోవిడ్ […]

Covid-19: ఏపీలో కోవిడ్-19 కలకలం.. ఓ యువతికి కరోనా లక్షణాలు..!
Follow us on

Covid-19 in Andhra Pradesh: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19 భారత్‌లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొదట ఈ వ్యాధి లక్షణాలు కేరళలో ముగ్గురికి బయటపడగా.. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వైరస్ నిదానంగా భారత్‌లో ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న తమిళనాడులో ఓ వ్యక్తి ఈ వైరస్ లక్షణాాలతోనే మృతి చెందినట్లు వైద్యులు అనుమానాలు వ్యక్తపరుస్తుండగా.. తాజాగా ఏపీలో కోవిడ్ కలకలం రేపుతోంది.

విశాఖపట్టణంలో కోవిడ్ లక్షణాలతో 18 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెకు ఛాతీ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న ఈ యువతి.. గతవారం విశాఖకు వచ్చింది. కొన్ని రోజులుగా ఆమె జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల వివరాలు, నమూనాలను పరిశీలన కోసం పంపగా.. ఆ రిపోర్టుల కోసం డాక్టర్లు ఎదురుచూస్తున్నారు.