లాక్‌డౌన్ వేళ.. ప్రేమించిన వాడితో పెళ్లి కోసం.. 40కి.మీల ఒంటరి నడక

| Edited By:

Apr 10, 2020 | 12:37 PM

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. అయితే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న మొండితో ఓ యువతి 40కి.మీలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది.

లాక్‌డౌన్ వేళ.. ప్రేమించిన వాడితో పెళ్లి కోసం.. 40కి.మీల ఒంటరి నడక
Follow us on

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. అయితే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న మొండితో ఓ యువతి 40కి.మీలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన యువకుడు, హనుమాన్ జంక్షన్‌కు చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం యువతి ఇంట్లో తెలియగా.. ఆమె తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్‌ జంక్షన్ నుంచి 40కి.మీల దూరంగా ఉన్న మచిలీపట్నానికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది ఆ యువతి. అక్కడ ప్రేమించినవాడిని కలిసి బుధవారం వివాహం చేసుకుంది. ఇక వారి వినతిపై జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి.. ఆ జంటను వారి వెంట పంపారు.

Read This Story Also: ‘లూసిఫర్‌’కు డైరెక్టర్ అతడేనట.. కన్ఫర్మ్ చేసిన చిరు..!