నేడు అనంతపురం జిల్లాలో బాబు పర్యటన

| Edited By: Srinu

Jul 09, 2019 | 12:55 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి నుంచి ఉదయం తొమ్మిదినర్నకు కడప విమానాశ్రయం చేరుకొని.. అక్కడి నుంచి తాడిపత్రి మండలం వీరాపురం గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్తారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో మృతి చెందిన భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో భోజనం చేయనున్నారు. అనంతరం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన […]

నేడు అనంతపురం జిల్లాలో బాబు పర్యటన
Follow us on

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి నుంచి ఉదయం తొమ్మిదినర్నకు కడప విమానాశ్రయం చేరుకొని.. అక్కడి నుంచి తాడిపత్రి మండలం వీరాపురం గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్తారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో మృతి చెందిన భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో భోజనం చేయనున్నారు.

అనంతరం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త గొల్లరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తరువాత ధర్మవం పట్టణంలోని ఓ ఫంక్షన్ హోల్‌లో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ స్థానంలో ఇంఛార్జ్‌గా మరో నేతను ప్రకటించనున్నారు. ఇక రాత్రి అనంతపురం ఆర్అండ్‌బీ అతిథి గృహంలో బస చేయనున్న చంద్రబాబు.. ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.