మీడియాకు చిక్కిన కాపీరాయుళ్లు..

| Edited By:

Apr 24, 2019 | 5:52 PM

ఎగ్జామ్ సెంటర్‌లో దర్జాగా మాస్ కాపీయింగ్ జరిగిన ఘటన విజయనగరంలో తీవ్ర కలకలం రేపింది. ఎంఏ సోషల్ వర్క్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీ చేసిన విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కాపీ రాయుళ్లతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు కూడా చేతులు కలిపినట్టు తెలుస్తోంది. దర్జాగా కాపీ చేసిన విద్యార్థుల నుంచి ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు లక్షలు దండుకున్నట్లు సమాచారం. ఎగ్జామ్ సెంటర్లో మీడియాను చూసి పుస్తకాలు దాచేందుకు యత్నించారు కాపీ రాయుళ్లు. చైతన్య డిగ్రీ […]

మీడియాకు చిక్కిన కాపీరాయుళ్లు..
Follow us on

ఎగ్జామ్ సెంటర్‌లో దర్జాగా మాస్ కాపీయింగ్ జరిగిన ఘటన విజయనగరంలో తీవ్ర కలకలం రేపింది. ఎంఏ సోషల్ వర్క్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీ చేసిన విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కాపీ రాయుళ్లతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు కూడా చేతులు కలిపినట్టు తెలుస్తోంది.

దర్జాగా కాపీ చేసిన విద్యార్థుల నుంచి ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు లక్షలు దండుకున్నట్లు సమాచారం. ఎగ్జామ్ సెంటర్లో మీడియాను చూసి పుస్తకాలు దాచేందుకు యత్నించారు కాపీ రాయుళ్లు. చైతన్య డిగ్రీ కాలేజ్‌లో జరిగిన ఈ యవ్వారాన్ని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి.