పల్నాడు ఉద్రిక్తత: అదనపు బీఎస్‌ఎఫ్ బలగాల తరలింపు

| Edited By:

May 27, 2019 | 11:03 AM

ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పాత పగలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నాలుగు కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలను పిలిపించినట్లు పిడుగురాళ్ల రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎక్కడా గొడవలు జరగకుండా చూడటమే తమ లక్ష్యమని, ప్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలిగ్ ఇస్తున్నామని, గొడవలు కొన్ని ప్రాంతాల్లోనే జరిగాయని అన్నారు. శాంతి […]

పల్నాడు ఉద్రిక్తత: అదనపు బీఎస్‌ఎఫ్ బలగాల తరలింపు
Follow us on

ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పాత పగలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నాలుగు కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలను పిలిపించినట్లు పిడుగురాళ్ల రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎక్కడా గొడవలు జరగకుండా చూడటమే తమ లక్ష్యమని, ప్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలిగ్ ఇస్తున్నామని, గొడవలు కొన్ని ప్రాంతాల్లోనే జరిగాయని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.