ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు కాల్.. తనిఖీలు చేస్తే తేలిందేంటంటే..

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2020 | 11:07 AM

సికింద్రాబాద్‌- విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ట్రైన్ బయలుదేరిన కాసేపటికే బెదిరింపు కాల్ రావడంతో.. అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. పోలీసులకు.. బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం అందించండంతో.. వెంటనే రంగంలోకి దిగిన వారు.. ట్రైన్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్‌తో బోగీలన్నీ చెక్ చేశారు. అయితే తనిఖీలు పూర్తైన తర్వాత.. బాంబు ఏం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన బెదిరింపు కాల్.. […]

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు కాల్.. తనిఖీలు చేస్తే తేలిందేంటంటే..
Follow us on

సికింద్రాబాద్‌- విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ట్రైన్ బయలుదేరిన కాసేపటికే బెదిరింపు కాల్ రావడంతో.. అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. పోలీసులకు.. బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం అందించండంతో.. వెంటనే రంగంలోకి దిగిన వారు.. ట్రైన్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్‌తో బోగీలన్నీ చెక్ చేశారు. అయితే తనిఖీలు పూర్తైన తర్వాత.. బాంబు ఏం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన బెదిరింపు కాల్.. ఫేక్ కాల్ అని.. ఆ కాల్ గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.