Breaking: తల్లిని కలిసిన అమృత

| Edited By:

Mar 14, 2020 | 8:07 PM

తన తల్లి దగ్గరకు అమృత వెళ్లింది. మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత.. అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది.

Breaking: తల్లిని కలిసిన అమృత
Follow us on

తన తల్లి దగ్గరకు అమృత వెళ్లింది. మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత.. అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది. మారుతీరావు మరణం తరువాత తొలిసారి తల్లి దగ్గరకు వెళ్లిన అమృత దాదాపు అరగంట పాటు ఆమెతో గడిపింది. ఈ సందర్భంగా తల్లిని పరామర్శించింది. అయితే ఆ సమయంలో అమృత బాబాయి శ్రవణ్ ఇంట్లో లేనట్లు సమాచారం. కాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఈ నెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ ఆయన గదిలో గోడకు రాశారు. అయితే దీనిపై స్పందించిన అమృత.. తన తల్లి దగ్గరకు వెళ్లలేనని.. కానీ తన వద్దకు తల్లి వస్తే చూసుకుంటానంటూ తెలిపిన విషయం తెలిసిందే.