శ్రావణి హత్య కేసు: పోలీసుల అదుపులో ఏడుగురు మృగాళ్లు

| Edited By:

Apr 29, 2019 | 11:53 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసులో రాచకొండ పోలీసులు ఏడుగురు అనుమానితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న బీరు బాటిళ్లపై ఉన్న వేలిముద్రలను సేకరించిన పోలీసులు.. వాటిని నిందితుల వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. కాగా గత గురువారం ఉదయం స్పెషల్ క్లాసులకని ఇంటి నుంచి వెళ్లిన 14ఏళ్ల శ్రావణి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రాత్రి వరకు వేచి చూసిన తల్లిదండ్రులు గ్రామస్థుల సహకారంతో ఊరంతా గాలించారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు […]

శ్రావణి హత్య కేసు: పోలీసుల అదుపులో ఏడుగురు మృగాళ్లు
Follow us on

తెలంగాణలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసులో రాచకొండ పోలీసులు ఏడుగురు అనుమానితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలంలో ఉన్న బీరు బాటిళ్లపై ఉన్న వేలిముద్రలను సేకరించిన పోలీసులు.. వాటిని నిందితుల వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. కాగా గత గురువారం ఉదయం స్పెషల్ క్లాసులకని ఇంటి నుంచి వెళ్లిన 14ఏళ్ల శ్రావణి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రాత్రి వరకు వేచి చూసిన తల్లిదండ్రులు గ్రామస్థుల సహకారంతో ఊరంతా గాలించారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి రాగా.. శుక్రవారం సాయంత్రం ఆమె మృతదేహం ఓ పాడుబడ్డ బావిలో కనిపించింది. నిందితులు బాలికను వెంటాడి పట్టుకొని ఉంటారని, ఆ తరువాత ఆమెను పొలాల్లోకి లాకెళ్లి సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విచారణను వారు వేగవంతం చేశారు.