దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్.. ఇద్దరు మృతి

| Edited By:

May 18, 2019 | 11:15 AM

అతివేగం ఇద్దరిని మింగేసింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి పటాన్ చెరు శివారులో వేగంగా వచ్చిన ఓ టిప్పర్.. అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న ఓ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో నిద్రిస్తున్న గోవింద్ నాయక్, హనుమంతులు స్పాట్‌లో చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేపై ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా, నిబంధనలకు తలొగ్గి షాపుని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీని ఫలితం ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. కేసు […]

దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్.. ఇద్దరు మృతి
Follow us on

అతివేగం ఇద్దరిని మింగేసింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి పటాన్ చెరు శివారులో వేగంగా వచ్చిన ఓ టిప్పర్.. అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న ఓ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో దుకాణంలో నిద్రిస్తున్న గోవింద్ నాయక్, హనుమంతులు స్పాట్‌లో చనిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగింది. నేషనల్ హైవేపై ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా, నిబంధనలకు తలొగ్గి షాపుని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీని ఫలితం ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేపడుతున్నారు.