ఏపీలో పంచాయితీ ఎన్నికల వివాదం చెలరేగుతూనే ఉంది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారం అనే వస్త్రాలను విడిచేసి చంద్రబాబు నగ్నంగా చెలరేగిపోతున్నారని విజయసాయి రెడ్డి ట్విట్ట ద్వారా విమర్శించారు. కళ్లు, చెవులు మూసుకుని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో అని ఎద్దేవా చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయంతో తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రచారానికి వెళ్లలేదని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో చెప్పిస్తున్నారని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలకు విలువే లేదా? అని ప్రశ్నించారు.
రాజకీయ అవసాన దశలో సభ్యత, సంస్కారపు వస్త్రాల్ని విడిచి పారేసి ‘నగ్నంగా’ చెలరేగిపోతున్నాడు చంద్రబాబు. కళ్లు,చెవులు మూసుకొని అయ్యో అనడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. ప్రజలైతే ఎప్పుడో తుపుక్కుమని ఊమ్మేసి బాబును పట్టించుకోవడం మానేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వికృత చేష్టలు చూపిస్తాడో!
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2021
GHMC ఎలక్షన్లలో అభ్యర్థులను నిలబెట్టి కూడా కరోనా భయానికి తండ్రీ కొడుకులిద్దరూ ప్రచారానికి వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికల్లో మీ కంటే పెద్దవాళ్లు క్యూలో నిల్చుని ఓట్లు వేయాలని నిమ్మగడ్డతో చెప్పిస్తున్నారే. ప్రజల ప్రాణాలకు విలువే లేదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2021