మరో సాంబర్ ఘటన.. అప్పుడు పురుషోత్తం.. ఇప్పుడు..!

| Edited By:

Nov 25, 2019 | 5:04 PM

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం లేని ఓ అంగన్వాడీ టీచర్.. నిర్వాకం వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలోని సాంబర్‌లో పడి.. ఓ మూడేళ్ల బాలుడి.. మృతి చెందిన ఘటన మర్చిపోకముందే.. అంతకు మించిన దారుణం ఇంకొకటి చోటు చేసుకుంది. విడ్తూరు మండలం చోట్కూరులో మూడేళ్ల చిన్నారి వేడి వేడి సాంబర్‌లో చేతులు పెట్టింది. దీంతో.. ఆ చిన్నారి చేతులు బొబ్బలెక్కిపోయాయి. ఆరాధ్య అనే చిన్నారి.. సాంబర్ పాత్రవైపు వెళ్లి చేతులు పెడుతున్నా.. అక్కడి అంగన్ వాడీ […]

మరో సాంబర్ ఘటన.. అప్పుడు పురుషోత్తం.. ఇప్పుడు..!
Follow us on

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం లేని ఓ అంగన్వాడీ టీచర్.. నిర్వాకం వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలోని సాంబర్‌లో పడి.. ఓ మూడేళ్ల బాలుడి.. మృతి చెందిన ఘటన మర్చిపోకముందే.. అంతకు మించిన దారుణం ఇంకొకటి చోటు చేసుకుంది.

విడ్తూరు మండలం చోట్కూరులో మూడేళ్ల చిన్నారి వేడి వేడి సాంబర్‌లో చేతులు పెట్టింది. దీంతో.. ఆ చిన్నారి చేతులు బొబ్బలెక్కిపోయాయి. ఆరాధ్య అనే చిన్నారి.. సాంబర్ పాత్రవైపు వెళ్లి చేతులు పెడుతున్నా.. అక్కడి అంగన్ వాడీ టీచర్.. చూసీ చూడనట్టుగా వ్యవహరించింది. కొద్దిరోజుల క్రితం.. పాణ్యంలోని విజయానికేతన్ స్కూల్లో.. పురుషోత్తం అనే మూడేళ్ల బాలుడు.. సాంబర్ పాత్రలో పడి చనిపోయిన సంఘటన మరువక ముందే.. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్ వాడీ టీచర్ల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.