ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన సంతమంగలూరు మండలం కొప్పరంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కోదండరామస్వామి ఆలయ కూడలి వద్ద వైసీపీ పార్టీకి చెందిన జెండా రాడ్.. విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పిల్లలు అక్కడ రాడ్ పట్టుకుని.. ఆడుకుందామనే సరికి.. కరెంట్ షాక్ తగిలి.. ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వీరి ముగ్గురు 5వ తరగతి చదువుతున్నారు. ముగ్గురు కూడా ఒకే వయసు కల్గినవారు.
1.షేక్ పఠాన్ గౌస్(11)
2. షేక్ హాసన్ బుడే(11)
3. పఠాన్ అమరల్ (11)
కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.