చెబుతున్నాగా..బాబే సీఎం- మంత్రి అయ్యన్న

| Edited By: Pardhasaradhi Peri

Apr 24, 2019 | 5:15 PM

తిరుమల : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వన్‌సైడ్ జరిగాయని..టీడీపీ విజయం ఖాయమని మంత్రి అయన్న పాత్రుడు ధీమా వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని ఆయన ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి.. స్వామివారి దర్శనానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు తీర్థప్రసాదాలను  అందజేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతిలో పెట్టవద్దని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

చెబుతున్నాగా..బాబే సీఎం- మంత్రి అయ్యన్న
Follow us on

తిరుమల : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వన్‌సైడ్ జరిగాయని..టీడీపీ విజయం ఖాయమని మంత్రి అయన్న పాత్రుడు ధీమా వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని ఆయన ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి.. స్వామివారి దర్శనానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు తీర్థప్రసాదాలను  అందజేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతిలో పెట్టవద్దని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.