Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి కనుమరుగవుతున్న తరుణంలో.. సీఎం జగన్ కనుసన్నల్లో నక్సలైట్లను తయారు చేసేలా డీజీపీ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. కాగా, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని తరలించిన ఘనటలో అనుమానితులు అచ్చెన్నాయుడు అనుచరులని నిర్ధారించిన పోలీసులు.. సెక్షన్ 41ఏ కింద అచ్చెన్నాయుడికి నోటీసులు జారీ చేశారు.
దాంతో గురువారం నాడు ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్లు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారో అని భయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆలయంలోని విగ్రహాన్ని ఎవరో తీసుకెళ్తే తనపై కేసులు పెట్టడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు తన వద్ద కూడా ఉన్నాయని, వాటిని కోర్టులో ప్రవేశపెడతానని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
Also read:
WhatsApp: యూజర్ల ప్రైవసీ కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్… అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..
Strain Virus: దేశంలో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ వైరస్.. మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?