ప్రజల మధ్య టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి: చంద్రబాబు

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 8:02 PM

టీడీపీ నేతలతో  సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ముఖ్యమైన విషయాలు చర్చించారు చంద్రబాబు. 38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య జరపాలని అన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రలోభాలకు, బీజేపీ, టీఆర్ఎస్ […]

ప్రజల మధ్య టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి: చంద్రబాబు
Follow us on

టీడీపీ నేతలతో  సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ముఖ్యమైన విషయాలు చర్చించారు చంద్రబాబు. 38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య జరపాలని అన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వైసీపీ ప్రలోభాలకు, బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడమని అన్నారు బాబు.

అలాగే.. కర్నాటక మంత్రులపై ఐటీ దాడులు.. బీజేపీ వేధింపులకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు 22 పార్టీలు అండగా ఉన్నాయని తెలియజేశారు. దేశం దృష్టి మొత్తం ఏపీ పైనే ఉందని.. టీడీపీ నేతలకు సూచించారు. రేపటి ఏపీ ప్రజల తీర్పే దేశానికే దిక్సూచి అని అన్నారు సీఎం చంద్రబాబు.