కర్నూలు జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న నంద్యాల లోక్ సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నంద్యాల ఎంపీ సీటు దక్కకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎస్పీవైరెడ్డితో జనసేన అధిష్టానం మంతనాలు జరుపుతోంది. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గత ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టీడీపీలో సీటు దక్కకపోవడంతో జనసేన వైపు చూస్తున్నారు.