ఫుల్లుగా తాగి మంత్రి కారునే అడ్డుకున్నారు.. కట్ చేస్తే.. సీన్ సీతార్ అయ్యిందిగా..

|

Jul 29, 2024 | 2:58 PM

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఏకంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కారును ఆపి నానా హంగమా చేశారు.. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేసి.. ‘‘ఎవడ్రా నువ్వు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది’’.. అంటూ వీరంగమేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం మసకపల్లిలో చోటుచేసుకుంది.

ఫుల్లుగా తాగి మంత్రి కారునే అడ్డుకున్నారు.. కట్ చేస్తే.. సీన్ సీతార్ అయ్యిందిగా..
Crime News
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఏకంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కారును ఆపి నానా హంగమా చేశారు.. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేసి.. ‘‘ఎవడ్రా నువ్వు.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది’’.. అంటూ వీరంగమేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం మసకపల్లిలో చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగి.. గంజాయ్ కొట్టిన ఆరుగురు యువకులు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కాన్వాయ్‌ మసకపల్లిలో ను అడ్డుకున్నారు. మంత్రి సుభాష్ వరద ముంపు ప్రాంతంలో పర్యటించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. చాలా సేపటి వరకు మందుబాబులు హల్చల్ చేశారు.. ఆ తర్వాత మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా.. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఆరుగురు మందుబాబులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మందుబాబులు రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మట్లపాలెం వెళ్లి కడియాలు తీసేసి(మందు తాగకుండా వేసిన కడియాలు) యానాంలో మందు తాగారు.. అనంతరం ఏటుగట్టు మీదుగా రాజమండ్రి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..