AP Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని పెనుగోలను గ్రామంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ అభ్యర్థి నుంచే ఊహించని తిరస్కరణ ఎదురైంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. ఇకపోతే.. టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు కోటా హరిబాబు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని చెప్పి.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అభ్యర్థి సహా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.
Also read:
‘చావు కబురు చల్లగా’ నుంచి సెకండ్ సాంగ్.. అందమైన మెలోడీతో రాబోతున్న బస్తీ బాలరాజు..
జాతి వైరం మరచి.. కుక్క ఆకలి తీర్చడానికి శక్తి మించి ప్రయత్నించిన కోడి.. వీడియో వైరల్