Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో విగ్రహాల రాజకీయం తారాస్థాయికి చేరుతోంది. రాష్ట్రంలోని విగ్రహాల ధ్వంసం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే విగ్రహాల ధ్వంసం విషయంలో రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం సంచలనంగా మారింది. ఈ చెప్పుల దండ వేసిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై చంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదర్కొలేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడికి కుట్ర జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకలకు పాల్పడుతోందని ఘాటుగా విమర్శలు గుప్పించారు. దాడుల వెనుక చంద్రబాబు హస్తముందని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విగ్రహాలపై దాడుల విషయంలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక సమర్పించిందని అన్నారు. త్వరలో అంబేద్కర్, వంటవీటి రంగా విగ్రహాలను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.
Also Read:
AP Panchayat Elections: నేడు రేషన్ వాహనాలను తనిఖీ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్..