పదో తరగతి పరీక్షకు వెళ్తూ ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

|

Mar 25, 2019 | 2:18 PM

పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ.. ఇద్దరు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం మండలానికి చెందిన శ్రీనివాస్, రామ్మోహన్ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బయల్దేరారట. వీరు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచార రధం క్వాలీస్  ఎక్కారని సమాచారం. ఇక మార్గం మధ్య కలిచెర్ల వద్దకు […]

పదో తరగతి పరీక్షకు వెళ్తూ ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
Follow us on

పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ.. ఇద్దరు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం మండలానికి చెందిన శ్రీనివాస్, రామ్మోహన్ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బయల్దేరారట. వీరు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచార రధం క్వాలీస్  ఎక్కారని సమాచారం. ఇక మార్గం మధ్య కలిచెర్ల వద్దకు వాహనం చేరుకోగానే.. దాని వీల్ కట్ అయినట్లు తెలుస్తోంది.. అంటే ఒక్కసారిగా వాహనం బోల్తా కొట్టింది.

దీనితో అక్కడిక్కడే విద్యార్థులు ఇద్దరూ మృతి చెందారు. కాగా వాహనంలో ఉన్న మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఆ ప్రచార రధం జనసేన పార్టీకు చెందినది అని సమాచారం.