AP Fishermen: వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద బోటు యజమానులకు సబ్సిడీపై చమురు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విధానంలో లబ్ధిదారులకు మేలు చేకూర్చేందుకు రైస్ కార్డులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సర్కార్ డిసైడయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాలకు అదనంగా మరికొన్ని చేర్చనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. వైయస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అమలు కోసం పడవ యజమానులకు స్మార్ట్ కార్డులను జారీ చేస్తోన్న ప్రభుత్వం… చమురుపై సబ్సిడీ మొత్తాన్ని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా బదిలీ చేస్తోంది.
కాగా మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంచడంతో పాటూ.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేట విరామ సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించారు.
Also Read :
SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!
World’s dirtiest man: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి.. 65 ఏళ్లగా స్నానమే చేయలేదట