అప్పుడే మంత్రివర్గమా?..వైసీపీవి పగటి కలలు- ప్రత్తిపాటి

|

Apr 23, 2019 | 4:30 PM

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చేశామని పగటికలలు కంటున్నారని… అనధికారకంగా అప్పుడే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఓవైపు ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈసీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్నవారు ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందిస్తుందని… కానీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు ఒక […]

అప్పుడే మంత్రివర్గమా?..వైసీపీవి పగటి కలలు- ప్రత్తిపాటి
Follow us on

వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చేశామని పగటికలలు కంటున్నారని… అనధికారకంగా అప్పుడే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఓవైపు ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈసీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్నవారు ఇచ్చిన ఫిర్యాదుకు వెంటనే స్పందిస్తుందని… కానీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు ఒక రూల్.. చంద్రబాబుకు ఒక రూల్ అన్నట్టుగా మోదీ, ఈసీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రత్తిపాటి పుల్లారావు. వేసవిలో ప్రజల తాగునీటి సమస్యపై, రైతుల ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేస్తే ఎన్నికల కోడ్ అంటూ ఆటంకాలు పెడతారా? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలపై మీకు ఎందుకు కక్షసాధింపు అని ప్రశ్నించిన ప్రత్తిపాటి.. ప్రజల కష్టాలు పట్టని జగన్ విదేశాలకు వెళ్లిపోయాడని విమర్శించారు.