Pawan Kalyan: రాజమండ్రిలో జనసేనాని.. మధురపూడిలో ఘన స్వాగతం, బాలాజీనగర్‌లో శ్రమదానం

|

Oct 02, 2021 | 12:20 PM

జనసేనాని పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి

Pawan Kalyan: రాజమండ్రిలో జనసేనాని.. మధురపూడిలో ఘన స్వాగతం, బాలాజీనగర్‌లో శ్రమదానం
Pawan
Follow us on

Pawan Kalyan – Rajahmundary: జనసేనాని పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హుకుంపేటకు చేరుకోనున్న జనసేనాని… బాలాజీనగర్‌లో శ్రమదానం చేయనున్నారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర రోడ్డుకు మరమ్మతులు చేసి, బహిరంగ సభలో పాల్గోనున్నారు.

పవన్ కల్యాణ్ టూర్‌తో రాజమండ్రిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేన సభా వేదికకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాలన్నింటినీ మూసివేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అరెస్టులు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలెవరూ రాజమండ్రి రాకుండా అడ్డుకుంటున్నారు.

జనసేనాని టూర్‌తో రాజమండ్రిలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. రాజమహేంద్రవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించారు. ధవళేశ్వరం ఆనకట్టు రోడ్డును మూసేశారు. జననేనాని టూర్ లైవ్..