కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలోని నంద్యాల చేరుకున్నారు. గత నెల 30న దివంగతులైన ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్ రాలేకపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లిన పవన్.. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.