అయోధ్యలో శ్రీ రామ భవ్య మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా నిధుల సేకరణ కార్యక్రమం జరగుతున్న విషయం తెలిసిందే. పలు హిందూ సంఘాలు, రామ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రామ భక్తులు తమ తోచిన విధంగా రామ మందిర నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు.
రామ జన్మభూమి సమీకరణ అభియాన్ లో భాగంగా తాము సైతం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. మందిర నిర్మాణం కోసం ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ జీకి రూ. 30 లక్షల చెక్కు ను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రామమందిర నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కోట్లాది మంది హిందువుల ఆకాంక్షను నెరవేరుస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలిన పవన్ పిలుపునిచ్చారు.