అమరావతి: పసుపు-కుంకుమ 3వ విడత నగదు విడుదలకు ఈసీ లైన్ క్లియర్ చేసింది. లబ్దిదారుల నిధుల విడుదలకు ఎన్నికల కోడ్ అడ్డురాదని ఈసీ తేల్చి చెప్పింది. కాగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో పధకం అమలుకు ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో మూడో విడతగా రూ.3900 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.
పసుపు- కుంకుమ పధకం ద్వారా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 10 వేల రూపాయలు సాయం ప్రకటించింది. మొదటి విడత కింద 2500 రూపాయలు.. రెండో విడత కింద 3500 రూపాయలు ఇచ్చింది. ఇక ఇప్పుడు మూడో విడతగా 4 వేల రూపాయలు సాయం అందించనుంది.