రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి.. ఓ వ్యక్తిపై ఆఫీస్‌లోనే దాడి!

| Edited By:

Nov 28, 2019 | 1:55 AM

రెవెన్యూ ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. పని చేయకపోగా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిపై తమ ప్రతాపం చూపుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఓ ఉద్యోగి సర్టిఫికెట్ కోసం వచ్చిన స్థానికుడిపై ఏకంగా దాడికి దిగాడు. ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్దాల బాబురావు అనే వ్యక్తి వారం రోజుల క్రితం కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయంపై రెవెన్యూ ఉద్యోగి పవన్ కుమార్ తో చర్చించాడు. అయితే అతను నిర్లక్యంగా […]

రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి.. ఓ వ్యక్తిపై ఆఫీస్‌లోనే దాడి!
Follow us on

రెవెన్యూ ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. పని చేయకపోగా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిపై తమ ప్రతాపం చూపుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఓ ఉద్యోగి సర్టిఫికెట్ కోసం వచ్చిన స్థానికుడిపై ఏకంగా దాడికి దిగాడు. ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్దాల బాబురావు అనే వ్యక్తి వారం రోజుల క్రితం కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయంపై రెవెన్యూ ఉద్యోగి పవన్ కుమార్ తో చర్చించాడు. అయితే అతను నిర్లక్యంగా సమాధానం చెప్పడంపై బాబురావు నిలదీశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఉద్యోగి పవన్ బయటకొచ్చి బాబూరావుపై పిడిగుద్దులు కురిపించాడు. విచక్షణారహితంగా కొట్టాడు. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది అతడిని లోపలి తీసుకెళ్లారు. పవన్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ఉద్యోగి ఇలా దాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.